శంషాబాద్ రూరల్, మార్చి 29 : మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని 21వ వార్డుకు చెందిన సురేశ్ అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్కు సమస్యను వివరించడంతో స్పందించిన ఆయన రూ.1.5 ఎల్వోసీని మంజూరు చేయించి మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కౌన్సిలర్లు రేఖ గుప్తా,అజయ్, నాయకుడు హన్ముంతు, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జనార్దన్రెడ్డికి నివాళులర్పించిన ఎమ్మెల్యే..
అత్తాపూర్: అంతర్జాతీయ హకీ ఎంపైర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జనార్దన్రెడ్డి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. ఆదివారం రాత్రి గుండె పోటుతో జనార్దన్రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం హైదర్గూడలోని కృష్ణానగర్లో ఆయన పార్ధివ దేహానికి ఎమ్మెల్యే నివాళుర్పించారు. ఆయన మాట్లాడుతూ.. హకీ ఎంపైర్గా ఉంటూ టీఆర్ఎస్ పార్టీలో చురుకు గా పనిచేశారన్నారు. ఎమ్మెల్యే వెంట సురేందర్రెడ్డి, సుభాశ్రెడ్డి, నరేందర్రావు, సదానంద్, కార్తీక్ ఉన్నారు.