రవీంద్రభారతి : మహిళలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర అంబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా విభాగం- 2022 క్యాలెండర్ను మంత్రి వి. శ్రీనివాస గౌడ్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గందం రాములుతో కలిసి అవిష్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని మహిళలకు రక్షణగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని ప్రైవేటు ఉద్యోగులకు కార్మికులకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారం కోసం పాటుపడుతామని, అన్ని విధాలుగా మహిళలకు అండగా ఉంటామని మంత్రి హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంఘం మహిళా అధ్యక్షురాలు ప్రభారెడ్డి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిర్మాలారెడ్డి, ఉపాధ్యక్షురాలు గీతగౌడ్, అనితారెడ్డి, సోషల్ మీడియా ఇన్చార్జి సాయిలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి ప్రభుయాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ వాణి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు సమతాయాదవ్, ఉపాధ్యక్షురాలు మేరీ సువర్ణ, కార్యదర్శులు సాయిలక్ష్మి చింత, శాభారాణి, ఆర్. లత, సేనపతి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.