రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇది మంచి ఆలోచన అని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
సర్కార్ బడుల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం పూట వారికి అల్పాహారాన్ని అందించేందుకు దాదాపు వీలు ఉండదు. పౌష్టికాహారం అందక పోవడంతో విద్యార్థులు చదువులతోపాటు క్రీడలు, శారీరకంగా ఎదగలేకపోతారు. ఇలాంటి పరిస్థితిల్లో వారికి తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగానే శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ పథకంపై ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అభినందనీయం. ఎంతో మంది పిల్లలు ఇంటిలోని పరిస్థితులతో ఉద యం ఏమి తినకుండానే పాఠశాలకు వస్తారు. అలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులు ఆరోగ్యంగా కూడా బాగుంటారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కె. మదన్మోహన్, ప్రధానోపాధ్యాయుడు, అడ్డగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల
ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ చేస్తే విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుంది. ఫ్రెష్గా ఉంటారు. చెప్పే పాఠాలను ఆసక్తిగా వింటారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. పొద్దున్నే వారి తల్లిదండ్రులు పనుల కోసం బయటకు వెళ్తారు. వారికి టిఫిన్ చేసి పిల్లలకు పెట్టే ఓపిక ఉండదు. దీంతో పిల్లలు ఖాళీ కడుపుతో స్కూల్కు వస్తారు. సీఎం కేసీఆర్ సార్ ఇప్పుడు ప్రవేశపెట్టిన బ్రేక్ఫాస్ట్ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉదయం పూట పిల్లలు ఆకలిలో కిందపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనలు జరగవు.
– వెంకటరెడ్డి, హెచ్ఎం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆజాంపుర
పాఠశాల విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరుగుతుం ది. ఎంతో మంది విద్యార్థులు ఇంటి వద్ద ఏమి తినకుండానే వచ్చి.. కళ్లు తిరిగి పడిపోతుంటారు. రక్తహీనతతో బాధపడుతుంటారు. పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. డ్రాప్ అవుట్స్నూ అరికట్టొచ్చు.
– గోపాల్, ప్రధానోపాధ్యాయుడు, ఆలియాబాద్, శామీర్పేట మండలం
ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఉదయం చాలా మంది పిల్లలు ఖాళీ కడుపుతో వస్తుంటారు. అలా వచ్చిన విద్యార్థులను చూస్తే బాధగా ఉంటుంది. ప్రభుత్వం ఇలాంటి పథకాలను తీసుకొస్తే పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. విద్యార్థులు మధ్యలో చదువు ఆపివేయడానికి కూడా వీలు ఉండదు. కొంత మంది విద్యార్థులు ఇంట్లో టిఫిన్ చేయలేదని డుమ్మాకొడుతుంటారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు.
– బడంగ్పేట
– గీతాంజలి, ఉపాధ్యాయురాలు రావిర్యాల
పిల్లల్ని బడికి పంపించాలంటే ఉదయాన్నే లేచి వంటలు చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వంటలు ఆలస్యమైతే పిల్లల్ని ఆలస్యంగా బడికి పంపేవాళ్లం. దీంతో వాళ్లు చదువులో వెనుకబడిపోయేవారు. ప్రభుత్వమే పేద విద్యార్థుల కోసం ఉదయాన్నే బలవర్థకమైన అల్పాహారాన్ని అందించడం గొప్ప విషయం. తల్లిదండ్రులు గాబరా పడాల్సిన అవసం లేదు.
– ఎస్.కవిత, విద్యార్థి తల్లి, కూకట్పల్లి
ఆకలితో వచ్చి చదువులో వెనుకబడే ఇబ్బంది ఉండదు. తల్లిదండ్రులు పేదవారు కావడంతో వారు వారి పనుల్లో నిమగ్నం కావడంతో ఉదయం సమయంలో అల్పాహారం అందించడం వీలు కాదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇలాంటి పథ కం తీసుకురావడం సీఎం కేసీఆర్ది గొప్ప ఆలోచన.
– హెచ్.రవీంద్రనాథ్, బహదూర్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇవ్వడం తో పిల్లలు స్కూల్కు వచ్చి చదువుకోవాలన్న ఆలోచన పుడుతుంది. అల్పాహారంతో విద్యార్థుల్లో ఉత్సా హం, చలాకితనం పెరుగుతుంది. డ్రాప్ అవుట్ విద్యార్థులకు కూడా పాఠశాలకు రావాలని ఆసక్తి వస్తుంది. సీఎం కేసీఆర్ సార్ ప్రవేశపెట్టిన బ్రేక్ ఫాస్ట్ పథకంతో పేద విద్యార్థుల్లో ఆనందం కనిపిస్తుంది. విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుంది.
– సత్యప్రసాద్ ప్రధానోపాధ్యాయుడు, మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
నేను నా భర్త ఉదయాన్నే పనికోసం బయటకు వెళ్తాం. నా ముగ్గురు పిల్లలకు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పంపించడం అప్పుడప్పుడు కష్టంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో పిల్లలు వెళ్తే చాలా బాధగా ఉండేది. సీఎం కేసీఆర్ సార్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టడంతో నా పిల్లలు ఇకనుంచి కడుపునిండా టిఫిన్ తినే అవకాశం దక్కింది. ఎంతో సంతోషంగా ఉంది.
-పార్వతి, చింతల్బస్తీ (బంజారాహిల్స్)
రోజు కూలీ పనులు చేసుకుంటూ.. సర్కార్ బడిలో చదివిస్తున్న మాలాంటోళ్ల పిల్లలకు పొద్దునే టిఫిన్లు గవర్నమెంట్ పెట్టడం ఆనందంగా ఉన్నది. టిఫిక్ చాలా రుచికరంగా ఉంది. ఇదే టిఫిన్ బయట హోటల్లో తింటే 50 రూపాయలకు పైగానే ఉంటుంది. సీఎం కేసీఆర్ సార్ మా బిడ్డల కోసం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ బడు ల్లో చదవడానికి విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపిస్తారు. కార్పొరేట్ స్కూల్ మాదిరిగానే మలక్పేట స్కూల్ కూడా ఉంది.
-కుమ్మరి లింగప్ప (అజంపురా)
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలను సీఎం కేసీఆర్ సార్ కల్పించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు విద్య కోసం ఖర్చు చేస్తున్నది. మా పాఠశాలలో మాకు అన్ని వసతులు ఉన్నాయి. ప్రతి రోజూ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనాన్ని వడ్డిస్తున్నారు. ఈ రోజు ఉదయం మంత్రి కేటీఆర్ సార్ మా పాఠశాలలో సీఎం బ్రెక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను కూడా ఉదయం టిఫిన్ చేశా. ఎంతో ఆనందంగా ఉంది.
– ఎం. ప్రియాంక, పదో తరగతి., వెస్ట్ మారేడ్పల్లి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
చాలా మంది ఇండ్లల్లో ఉదయం పూట టిఫిన్ ఉండదు. చాలా సార్లు ఆకలితో పాఠాలు వినేవారే ఎక్కువే. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్తో వారంలో ఆరు రోజు లు రుచికరమైన టిఫిన్ తినగలుగుతాం. సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– లహరి, పదో తరగతి, బహదూర్పల్లి
మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ అందిస్తున్న కేసీఆర్ తాతకు కోటి దండాలు. మా అమ్మానాన్నలు ఉదయమే కూలీ పనులకు వెళ్తారు. ఉదయం ఏమి తినకుండానే స్కూల్కు వస్తా. ఉద యం అల్పాహారం ఇవ్వడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్, షూలు, పుస్తకాలు ఇస్తూ మంచిగా చదువు చెబుతున్నారు.
– సాత్విక, 4వ తరగతి, నాగారం
– మేడ్చల్ కలెక్టరేట్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ సీఎం బ్రెక్ఫాస్ట్ పథకం ద్వారా ఉదయం 8 గంటలకు అల్పాహారం అందించడం చాలా సంతోషంగా ఉంది. మంచి ఆహారాన్ని అందించడం ద్వారా విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు సీఎం కేసీఆర్ సార్ ఉచితంగానే నోట్, టెస్ట్ పుస్తకాలు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, స్కూ ల్ యూనిఫామ్ అందిస్తున్నారు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవడమే నా లక్ష్యం.
– వి.పవిత్ర, పదో తరగతి, వెస్ట్ మారేడ్పల్లి, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల
ఉదయం పూట మాకు టిఫిన్ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైమ్ మాకు స్కూల్లో టిఫిన్ పెట్టడం. ఈరోజు మాకు పూరీ, ఇడ్లి, ఉప్మా, ఆలుకర్రీ, సాంబారు, స్వీటు పెట్టారు. మంచి రుచిగా ఉన్నాయి. ఒక్కోసారి నేను పొద్దున్నే ఇంట్లో తినకుండానే స్కూల్కు వస్తాను. మధ్యలో ఆకలి వేస్తుంది. ఇప్పుడు స్కూల్లో టిఫిన్ పెట్టడం ఆనందంగా ఉంది.
– వి.కార్తీక్, ఏడో తరగతి
బడికి రాగానే వేడివేడి టిఫిన్ పెట్టడం బాగుంది. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని బడికి వస్తాం. ఒక్కొక్కసారి ఇంట్లో అల్పాహారం లేకుంటే ఖాళీ కడుపుతోనే బడికి వస్తాం. ఇప్పుడు బడిలోనే అల్పాహారం పెట్టడంతో మా ఆకలి సమస్య తీరుతుంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల బడిలో చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాం. తోటి విద్యార్థులతో కలిసి చదువులతో భోజనాలు కూడా చేయడం సంతోషంగా ఉంది.
– రక్షిత, విద్యార్థిని, కూకట్పల్లి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు అల్పాహారం పెట్టడం ఎంతో మంచి నిర్ణయం. తల్లిదండ్రులు పనులకు వెళితే.. ఇంట్లో టిఫిన్ ఉం డదు. ఉదయం కూడా అన్నం తిని బడికి వస్తాం. ఇం ట్లో వంటలు ఆలస్యమైతే ఇబ్బంది పడ్డాం. బడికి ఆలస్యంగా వస్తే పాఠాలు అర్థమయ్యేవి కావు. బడిలోనే అల్పాహారం పెడుతుండటం వల్ల విద్యార్థులందరికీ ఆకలి సమస్యలు ఉండవు.
– భార్గవి, విద్యార్థిని, కూకట్పల్లి
ఇంట్లో కంటే బడిలోనే టిఫిన్ బాగుంది. నేను రోజు స్కూల్కు వచ్చే సమయంలో సరిగ్గా టిఫిన్ చేయను. స్కూల్కు టైం అయిపోతుందని టిఫిన్ చేకుండానే స్కూల్కు వస్తాను. వారంలో రెండు మూడు రోజులు మాత్రమే తినేది. స్కూల్లో మాత్రం రోజు మధ్యాహ్న భోజనం మాత్రం తప్పకుండా చేస్తాను. ఇప్పుడు రోజూ స్కూల్లో టిఫిన్ కూడా పెడుతారు. ఇడ్లీ సాంబర్ తిన్నాను. చాలా బాగుంది. వేడి వేడిగా వడ్డించారు. ఇక నుంచి రోజూ స్కూల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా తప్పకుండా చేస్తాను.
-ప్రసన్న, 5వ తరగతి