మేడ్చల్, జోన్ బృందం, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ర్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై వక్తలు ప్రసంగించారు. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణలో మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ రజితారాజమల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీటీసీ శైలజావిజయానందారెడ్డి, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మేయర్ కావ్య మాట్లాడుతూ.. ఉద్యమ నేతగా కేసీఆర్ చెప్పిన మాటలన్నీ నేడు అక్షర సత్యాలై కండ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయని, త్యాగలతో కష్టాల కడలిని దాటుకుని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు.
విద్యా, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ ఆర్వో ప్రభాకర్యాదవ్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, తెలంగాణ ఉద్యమకారులు సుధాకర్చారి, సింగన్న బాల్రాజ్, శ్రీరాములు, పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి ఉద్యమకారులకు సన్మానం చేశారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్, పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. పోచారం కమిషనర్ సురేశ్, సీఐ అశోక్రెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ఘట్కేసర్లో బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఎగురవేశారు.
బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బోడుప్పల్ ప్రధాన కూడలి అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మేయర్ సామల బుచ్చిరెడ్డి హాజరయ్యారు. డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాలకృష్ణ, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు కాటపల్లి రాంచంద్రారెడ్డి, బొమ్మక్ బాలయ్య, విశ్వనాధ్, చక్రపాణిగౌడ్, జంగారెడ్డి, శత్రజ్ఞ, కార్యకర్తలు పాల్గొన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయం వద్ద మేయర్ బుచ్చిరెడ్డి పతాకావిష్కరణ చేశారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 11వ డివిజన్లో గడుసు జగదీశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో శ్రీనివాస్గుప్త, సంతోశ్రెడ్డి, మోతె రాజు, ఉప్పరి విజయ్ పాల్గొన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మేయర్ జక్కా వెంకట్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కీసర మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ గౌరివత్సల, ఇంకా పలు పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా గ్రామ్లాలోని సర్పంచ్లు, మండల ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డిలు జెండా ఆవిష్కరణ గావించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ మండలంలోని డబిల్పూర్ గ్రామంలో పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సర్పం చ్ సన్మానించి 19 మందికి పంచాయతీ ఆధ్వర్యంలో కొత్తబట్టలు పంపిణీచేశారు. స్వంత ఖర్చులతో ఒక్కొరికి రూ 3 వేల విలువగల వంట సామగ్రిని సర్పంచ్ అందజేశారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
మున్సిపల్ కమిషనర్ రాములు, వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు జైపాల్రెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, పెంటయ్య, వీణ సురేందర్, హేమంత్రెడ్డి, బాల్రాజ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు సంజీవగౌడ్, నాయకులు జనార్దన్రెడ్డి, వెంకటేశ్ తదితరులు ఎంపీటీసీ హేమలత, ఉప సర్పంచ్ సత్యనారాయణ, వార్డు సభ్యులు దామోదర్రెడ్డి, కవిత సుదర్శన్, స్వప్న శ్రీనివాస్, సరిత శ్రీనివాస్, రేణుక శ్రీనివాస్, శ్రీనివాస్, అశ్విని హరిప్రసాద్, నాయకులు భాగ్యరెడ్డి, అశోక్, గంగారామ్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కార్యాలయాల్లో చైర్మన్లు కౌకుంట్ల చంద్రారెడ్డి, వసుపతి ప్రణీత శ్రీకాంత్గౌడ్ జాతీయ జెండాలను ఎగురవేశారు. నాగారం, దమ్మాయిగూడ, రాం పల్లి, అహ్మద్గూడ, కుందన్పల్లి, రాజీవ్గృహ కల్ప కాలనీలో వివిధ పార్టీ నాయకులు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు మల్లేశ్, నరేందర్ రెడ్డి, కమిషనర్లు స్వామి, మేనేజర్లు చంద్రశేఖర్, రమేశ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
దేశంలోనే ఆదర్శం తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం కీసర మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆమోయ్కుమార్, అదనపు కలెక్టర్ అభిషేక్ ఆగస్త్య, సైబరాబాద్ సీపీ స్టీపెన్ రవీంద్రలతో పాటు పలువురు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో మరెక్కడ జరుగలేదన్నారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో రవికుమార్, మండల తహసీల్దార్ గౌరివత్సల, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటేశ్, ఎంపీపీ ఇందిరలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ సత్తిరెడ్డి, కీసర సర్పంచ్ మాధురి, ఎంపీటీసీ నారాయణశర్మలతో పాటు పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.