రవీంద్రభారతి, జూన్ 30: తెలంగాణ ఆణిముత్యాలు-2021 అవార్డులను ఎక్సైజ్, సంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రదానం చేశారు. బుధవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఫిలో ట్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అద్దంకి రాజు ఆధ్వర్యంలో వివిధ రంగాలల్లో ప్రావీణ్యం కలిగిన వారికి తెలంగాణ ఆణిముత్యాలు-2021 అవార్డులను మంత్రి శ్రీనివాస్గౌడ్ అందజేశారు. ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు, టీచర్స్ రంగం నుంచి డాక్టర్ చిలుముల బలిరెడ్డి, కవి సాహిత్యం నుంచి మాగంటి ప్రసాద్, కార్మిక విభాగం నుంచి ఎం.గంగాధర్రావు, సామాజిక రంగం నుంచి కాసుల రవీందర్, విజయ, మహిళా హక్కుల కోసం కృషి చేసిన శశిరేఖకు, డాక్టర్స్ విభాగం నుంచి ప్రేమలత, యువజన విభాగం నుంచి నరేశ్, నల్గొండ జేఏసీ నాయకులు మహేశ్, టీపీఎస్ నాయకులు భాస్కర్ మోహన్, రూప్సింగ్ తదితరులు అవార్డులు అందుకున్నవారిలో ఉన్నారు.