కవాడిగూడ, జూన్ 25: విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతిచెందాడు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం… సంతోష్నగర్కు చెందిన డీసీఎం డ్రైవర్ మాజీద్(45) శుక్రవారం ఉదయం దేవీచౌక్ నుంచి వెళ్తుండగా, వాహనానికి విద్యుత్ వైర్లు తగిలి తెగిపడ్డాయి.
అదే సమయంలో వాహనంపై వస్తున్న భోలక్పూర్కు చెందిన మహమ్మద్ సమీర్(14)పై పడి.. విద్యుదాఘాతంతో చనిపోయాడు.