ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 24: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘టెక్నోస్మానియా 2023’ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సన్నాహకంగా సోమవారం 3కే రన్, ఫ్లాష్ మాబ్, బైక్ ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు. ఓయూ ఎన్సీసీ గేటు నుంచి రన్ను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కోశాధికారి, మాజీ శాస్త్రవేత్త సీపీ రాములు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఓయూ పరిపాలనా భవనం సమీపంలోని ఎల్లమ్మ దేవాలయం ఎదుట రోడ్డుపై నృత్యాలు ప్రదర్శించారు. రన్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రొఫెసర్లు బహుమతులు అందజేశారు. ‘గ్రీన్ లివింగ్ ఈజ్ స్మార్ట్ లివింగ్’ అనే నినాదంతో రన్ను నిర్వహించడం విశేషం. విద్యార్థులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టెక్నోస్మానియా వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాయిలు, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ హయవదన, డీన్ ప్రొఫెసర్ వి. రమేశ్కుమార్, ప్రొఫెసర్ వీవీ బసవరావు, ప్రొఫెసర్ శ్రీనునాయక్, కన్వీనర్ డాక్టర్ జ్యోతి, కోకన్వీనర్ డాక్టర్ ఎ. పరశురాం, డాక్టర్ కవిత, ప్రొఫెసర్ ధనలక్ష్మి, డాక్టర్ భాస్కర్, డాక్టర్ అజిత్కుమార్, డాక్టర్ అభిలాష్, డాక్టర్ ఐలయ్య, డాక్టర్ రమేశ్, డాక్టర్ సునీత, విజయకాంత్, డాక్టర్ అర్జున్, డాక్టర్ ధీరజ్, అనురాధ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓయూలో 2కే వాక్
ఉస్మానియా యూనివర్సిటీ 106వ ఆవిర్భావ దినోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను ముందస్తుగా ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ఎన్సీసీ గేటు వరకు 2కే వాక్ నిర్వహించారు. రన్ అనంతరం నిర్వహించిన టగ్ ఆఫ్ వార్లో వైస్ చాన్స్లర్స్ లెవెన్పై ప్రిన్సిపాల్స్ లెవన్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 25న వర్సిటీలోని అన్ని విభాగాల్లో ఓపెన్ హౌజ్ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నారు. 26న ఠాగూర్ ఆడిటోరియంలో ఉదయం 10:30 గంటలకు జరుగనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా ఓయూ పూర్వ విద్యార్థి, వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ, గౌరవ అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, యూజీసీ సభ్యుడు, ఇఫ్లూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఇ.సురేశ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. మధ్యాహ్నం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సుద్దాల అశోక్తేజ హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లు, డీన్లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.