Begumpet | హైదరాబాద్ : వాయుసేనకు చెందిన ఓ శిక్షణా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 40 నిమిషాల పాటు బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో గాల్లోనే చక్కర్లు కొట్టింది. ల్యాండింగ్ సమయానికి హైడ్రాలిక్ వీల్స్ తెరుచుకోకపోవడంతో విమానంలో గాల్లోనే తిరిగింది. చివరకు ముందు వైపు వీల్స్ తెరుచుకోవడంతో బేగంపేట ఎయిర్పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ అయింది. విమానంలో పైలట్లు సహా మొత్తం 12 మంది సురక్షితంగా బయటపడ్డారు.