సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని, అలాగే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు నివారించాలని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య ఆధ్వర్యంలో గురువారం రవా ణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందించారు. ఆటో కార్మికుల సమస్యలపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని మంత్రి చెప్పినట్టు ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్, టీఏటీయూ స్టేట్ ఆర్గనైజర్ దయ్యాల దాసు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పోలే నిరంజన్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, ఎస్ రామ్, కిషన్, ఉపేందర్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.