వర్ధన్నపేట, ఏప్రిల్ 23 : రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎంపీపీ అన్నమనేని అప్పారావు అన్నారు. మండలంలోని ఆర్డీతండాలో శుక్రవారం ఎంపీపీ, జడ్పీటీసీ, ప్రజాప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. కరోనాతో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. రైతులు కేంద్రాల వద్ద నిబంధనల ప్రకారం ధాన్యాన్ని విక్రయించుకోవడంతో పాటు మాస్కులు ధరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీ తండా సర్పంచ్ గుగులోతు లక్ష్మి, చంద్రుతండా సర్పంచ్ మాలోత్ స్వరూప, ఎంపీటీసీ గుగులోత్ అనసూయ, ఏరువాక డైరెక్టర్ చొప్పరి సోమయ్య, రైతులు పాల్గొన్నారు.
రైతుల మేలు కోసమే..
రాయపర్తి : రైతుల మేలు కోసమే ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి తెలిపా రు. ఇందిరాక్రాంతి పథకం-మహిళా స్వ యం సహాయక సంఘాల నిర్వహణలో మండలంలోని తిర్మలాయపల్లి, బురహాన్పల్లి, కాట్రపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, ఐకేపీ ఏపీఎం పులుసు అశోక్కుమార్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేసినప్పటికీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కార్యక్రమంలో సర్పంచ్లు గజవెల్లి అనం తప్రసాద్, గుడి యుగేంధర్రెడ్డి, బోనగిరి ఎల్లయ్య, మాధవి, సూదుల దేవేందర్రా వు, బిజ్జాల సోమనాథం, గుడి మైబూబ్రె డ్డి, మహిళా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు స్రవంతి, రాణి, రమ్య, అనురాధ, వశపాక కుమారస్వామి, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ఆలేటి సోమిరెడ్డి, సీసీ లు వినోద, యాదగిరి, అనిత, గొల్లపల్లి రమేశ్, మొర్రి రాజేందర్, మహ్మద్ అనీస్, అశోక్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు, నిర్వాహకులు కరోనా నిబంధలను పాటించాలని తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ కోరారు. మండలంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఐకేపీ-మహిళా స్వయం సహాయక సంఘాల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయపర్తి చైర్మన్ కుం దూరు రాంచంద్రారెడ్డి, సర్పంచ్ గూబ యాకమ్మతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంద సునీత, యాకూబ్రెడ్డి, ఎంపీటీసీ భూక్యా గోవింద్నాయక్, పలు సంఘాల ప్రతినిధులు రఫియా, పొన్నం శోభ, సుదగాని భాగ్య మ్మ, సీఏలు పెదగాని సరిత, వెంకటేశ్వర్లు, గొట్టం ప్రతాప్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బత్తుల నర్సయ్య, పొన్నం కుమారస్వామి, నకిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.