Talasani Srinivas Yadav | హైదరాబాద్ : అయోధ్య రామమందిరాన్ని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అయోధ్య ఎమ్మెల్యే రాంచందర్ బిదాయితో కలిసి బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు తలసాని శ్రీనివాస్ యాదవ్. పూజల అనంతరం ట్రస్ట్ సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను సన్మానించారు. హనుమాన్ గుడిని సందర్శించి, పూజలు చేశారు. అక్కడే ఉన్న గురూజీ రాజుదాస్ వద్ద తలసాని ఆశీర్వాదం తీసుకున్నారు.