Srinivas Yadav | ప్రజా తీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి, సనత్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ కామర్స్లోని కౌంటర్ కేంద్రం వద్ద అధికారులు ఫలితాలు ప్రకటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సనత్నగర్ నుంచి మూడోసారి గెలిచానన్న సంతోషం కంటే.. బీఆర్ఎస్ అధికారంలోకి రాలేకపోతున్నామనే బాధ ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్కు అభినందనలు తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లలో జరగని అభివృద్ధి తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ సీఎం అయ్యాక నాయకత్వంలో గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో జరిగిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తాగు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులుపడే వారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తామని చెప్పారు. మినీ ఇండియాగా పిలిచే హైదరాబాద్ నగరంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఎంతో అభివృద్ధి చేసిందని చెప్పారు. హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంత్రిగా ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో స్పష్టమైన మెజారిటీని సాధించామన్నారు. తనపై ఓటమిపాలైన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు కోట నీలిమ, మర్రి శశిధర్రెడ్డిలకు ఆయన సానుభూతి ప్రకటించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఓటమి చెందామని అధైర్యపడొద్దన్నారు.