హైదరాబాద్: ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో జరుగుతున్న రంజాన్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుని ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈద్ ఉల్ ఫీతర్ ఉదయం 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసబ్ట్యాంక్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.