ఉప్పల్, జూన్ 27 : ప్రభుత్వం అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ అన్నారు. ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్ను అందించారు. ఈ సందర్భంగా శిశువును పరిశీలించి, పలు సూచనలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సేవలు అందించడంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించి, ఆరోగ్య సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ఆరోగ్య రికార్డులను పరిశీలించి, వైద్యులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్, సిబ్బంది పాల్గొన్నారు.