కవాడిగూడ, ఫిబ్రవరి 2 : లోయర్ ట్యాంక్బండ్లోని దోమలగూడ రామకృష్ణ మఠంలో శుక్రవారం స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మఠంలోని శ్రీ రామకృష్ణుల విశ్వజనీన దేవాలయంలో సుప్రభాతం, మంగళహారతి, భజన కార్యక్రమాలు, దేవాలయ ప్రదక్షిణలు, విశేష పూజ, భజనలు, హోమం పూజల్లో మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అనంతరం స్వామి వివేకానందుని జీవితంపై బోధమయానంద సందేశం ఇచ్చారు. వివేకానందుని ఆశయసాధనకు యువత పాటుపడాలన్నారు.