హైదరాబాద్ : విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. హైదరాబాద్లోని
కోఠి లో స్వామి వివేకానంద పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద 160 వ జయంతి లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆయన మాట్లాడుతూ నేటి యువతకు దేశభక్తి, సమాజ సేవలో స్వామి వివేకానంద ఆదర్శమని అన్నారు. వివేకానంద బోధించిన అంశాలు పుస్తకాల రూపంలో ఉన్నాయని వాటిని చిన్నతనం నుంచే ప్రతి ఒక్కరూ ఆచరిస్తే వ్యక్తిగత అభివృద్ధి, సమాజ సేవ, క్రమ శిక్షణ అలవాటవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యుడు బుగ్గారపు దయానంద్, వివేకానంద పౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.