హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కార్యకలాపాల కోసం కొత్త కమిటీని పునర్నిర్మించనున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాని కోసం మాజీ ఆటగాళ్లు, జడ్జిల గురించి సుప్రీం ఆరా తీసింది. అలాగే.. ఆటగాళ్ల మీద ఫోకస్ పెట్టాలని.. రాజకీయాల మీద ఫోకస్ పెడితే టీమ్ గెలుపొందనని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది.
సుప్రీం ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. హెచ్సీఏ అంబుడ్స్మెన్గా సుప్రీం జడ్జి జస్టిస్ దీపక్ వర్మను నియమించడంపై అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ ప్రెసిడెంట్, మాజీ టీమిండియా కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, క్రికెట్ బాడీ సెక్రటరీ ఆర్ విజయానంద్, ప్యానెల్లోని ఇతర వర్గాల మధ్య జస్టిస్ దీపక్ వర్మను అంబుడ్స్మెన్గా నియమించడంపై వ్యతిరేకత వ్యక్తం అయింది.
జస్టిస్ దీపక వర్మ అంబుడ్స్మెన్గా నియమితులయ్యాక చేపట్టిన చర్యల వ్యవహారం కోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతోంది. తాజాగా సుప్రీం బెంచ్ కమిటీ పునర్మిర్మాణంపై స్పష్టమైన తీర్పు చెప్పింది.
హెచ్సీఏ వ్యవహారంపై ఏర్పాటైన సుప్రీం బెంచ్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లీడ్ చేస్తున్నారు. కమిటీ కేవలం ఆటగాళ్ల మీద, ఆట మీద మాత్రమే ఫోకస్ చేయాలని.. అలా కాదని రాజకీయాల మీద ఫోకస్ చేస్తే ఇలాగే ఉంటుందని.. ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్ అయ్యేసరికి ఆట మీద ఫోకస్ చేస్తున్నారని ఎన్వీ రమణ వ్యక్తం చేశారు.
ఆటతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల పేరు ఇవ్వండి. అలాగే.. రాజకీయాలకు అతీతంగా వాళ్లు ఉండేలా చూసుకోండి. మేమే కమిటీని ఏర్పాటు చేస్తాం.. అని బెంచ్లోని ఇతర జడ్జిలు ఏఎస్ బోపన్నా, హిమ కోహ్లీ స్పష్టం చేశారు.
మరోవైపు హెచ్సీఏ స్టాఫ్స్కు జీతాలు ఇవ్వడం లేదని.. సెక్రటరీ చెక్కుల మీద సంతకాలు పెట్టడం లేదని.. సీనియర్ అడ్వకేట్ రాకేశ్ ఖన్నా.. సుప్రీంలో వాదించగా.. అందుకే మేము కమిటీ కోసం కొత్త పేర్లను అడుగుతున్నామంటూ బెంచ్ మరోసారి స్పష్టం చేసింది.
అయితే.. అక్టోబర్ 27న హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్, సెక్రటరీ జయానంద్ ఇద్దరూ చెక్కుల మీద సంయుక్తంగా సంతకాలు పెట్టాలంటూ హెచ్సీఏలో ఉన్న ఆధిపత్య పోరుకు బ్రేక్ చెప్పేందుకు సుప్రీం ఆ నిర్ణయం తీసుకుంది. దాని వల్ల చివరకు హెచ్సీఏ స్టాఫ్కు జీతాలు కూడా అందని పరిస్థితి నెలకొన్నది.
అలాగే.. అంబుడ్స్మెన్ జస్టిస్ వర్మ పదవీ కాలం త్వరలో ముగస్తున్న సందర్భంగా ఆయన ఎటువంటి నిర్ణయాలను ఇక తీసుకోవద్దంటూ సుప్రీం ఇప్పటికే అదేశించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. యాంకర్ రవి ఫిర్యాదు