మూసాపేట్, డిసెంబర్ 14 : సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ టీవీ యాంకర్ ఆర్.రవికిరణ్ (రవి) మంగళవారం కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొందరు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ చానల్స్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తనతో పాటు తన కుటుంబ సభ్యులను వదలడం లేదని తెలిపాడు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరాడు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.