దుండిగల్, మార్చి 20 : అకారణంగా మూసివేసిన జీడిమెట్ల పారిశ్రామికవాడలోని సూపర్మాక్స్ పరిశ్రమ లో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించడంతో పాటు కార్మికులకు బకాయిపడ్డ 9నెలల జీతాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ, ఐఏటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం షాపూర్నగర్ చౌరస్తాలో ఆయా సంఘాల కార్మికులు నిరసన ప్రదర్శనచేసి రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కీలుకాని లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఉమామహేశ్ మాట్లాడుతూ .. సూపర్మాక్స్ పరిశ్రమ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించడంతో పాటు పరిశ్రమలో ఉత్పత్తిని పునఃప్రారంభించాలన్నారు. లేని పక్షంలో మిగతాకార్మిక సం ఘాలతో కలిసి ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి బీరప్ప, దేవదానం, ఏఐటీయూసీ కుత్బుల్లాపూర్ మండల కార్యదర్శి స్వామి, నేతలు శ్రీనివాస్తో పాటు సూపర్మాక్స్ పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు.