సుల్తాన్బజార్, ఫిబ్రవరి 7: మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఈ నెల 9 నుంచి ప్రతి రోజు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 9 నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి ప్రతి రోజు ఉదయం 6 గంటలకు, 6.30 గంటలకు, 7 గంటలకు మూడు సూపర్ లగ్జరీ బస్సులు బయలుదేరి ఉప్పల్, హన్మకొండ, వరంగల్ మీదుగా మేడారానికి చేరుకుంటాయన్నారు. ఈ ప్రత్యేక బస్సులలో పెద్దలకు రూ.750, పిల్లలకు రూ. 450 చార్జీలు నిర్ణయించామని పేర్కొన్నారు.