సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతలతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ పోలీసులు భాగస్వాములవుతున్నారు. పెట్రోలింగ్ కోసం ఈ బైక్లను వాడుతున్నారు. పీవీ నరసింహారావు మార్గ్లోని లేక్ పోలీస్స్టేషన్కు ఇప్పటికే ఈవీలు మంజూరు కాగా బుధవారం సాయంత్రం పోలీసులు వాటిపై పెట్రోలింగ్ నిర్వహించారు. గంటన్నర చార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని.. వినియోగంలోనూ ఈ స్మార్ట్ బైక్ ఎంతో బాగుందని లేక్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓ బి. ధనలక్ష్మి తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించని ఈ బైక్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇక నుంచి ఈ వాహనాలను ప్రతిరోజు వినియోగిస్తామని ఆమె అన్నారు.