ఆదివారం ట్యాంక్బండ్పై సండే ఫన్డే ఉత్సాహంగా సాగింది. నగరవాసులు ఉల్లాసంగా గడిపారు. అదే సమయంలో విద్యుద్దీపాలతో కొత్త సచివాలయం.. మిరుమిట్లు గొలిపే మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులకు కనువిందు చేశాయి.
రాష్ట్ర పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ట్యాంక్బండ్పై నిర్వహించిన సండే ఫన్డేలో నగర వాసులు ఆద్యంతం ఉత్సాహంతో గడిపారు. హుస్సేన్సాగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ను చూస్తూ పిల్లలు, పెద్దలు గొప్ప అనుభూతిని పొందారు. కుటుంబ సమేతంగా, స్నేహితులతో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు.