Hyderabad | ఎండలు దంచికొడుతుండటంతో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్సులను కుదించాలని నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీక్వెన్సీని తగ్గించింది. రేపు (బుధవారం ) నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఎండల తీవ్రత తగ్గే వరకు ఇదే కొనసాగనుంది.
ఎండలు మండుతుండటంతో మధ్యాహ్నం సమయంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు పెద్దగా బయటకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సుల ఫ్రీక్వెన్సీని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఇక ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బస్సు సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి.