కీసర,జనవరి4: చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన భవనాలు, నాణ్యమైన విద్య కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల పాఠశాలలు సక్సెస్బాటలో నడుస్తున్నాయి. గురుకులంలో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల పంటను పండిస్తున్నారు. 2020-21సంవత్సరంలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో 12 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించి సత్తాను చా టారు. కీసరగుట్టకు వెళ్లే రహదారిలోని మలక్పేట్, నాంపల్లి, చార్మినార్ నియోజకవర్గ ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటుచేసి మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో1440మంది విద్యార్థినులు చదువుతున్నారు.
ఈ పాఠశాల్లో ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలను అం దించి నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఈ గురుకులంలో చదివించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ పాఠశాలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. ఈ పాఠశాల్లో విద్యార్థులకు సరిపడా 62మంది ఉపాధ్యాయులు ఉన్నా రు. ఈ గురుకులంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితం గా నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు,బెడ్షిట్స్, మూడు జతల యూనిఫారం, ట్రాక్ షిట్స్ షూస్, టైబెల్ట్తో పాటు అధునిక సౌకర్యాలతో విద్యను అందిస్తున్నారు.
2021-22 నుంచి ఇంటర్మీడియట్ అప్గ్రేడ్
కీసరలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో ఇంటర్మీడియట్గా అప్గ్రేడ్ చేసింది. చార్మినార్, మలక్పేట్ నియోజకవర్గాలకు సంబంధించి ఇంటర్మీడియట్ కళాశాలను నడిపిస్తున్నారు. ఈ గురుకులంలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ,సీజీఏ, సీఈసీ గ్రూప్ల్లో విద్యార్థులు విద్య ను అభ్యసిస్తున్నారు. గత సంవత్సరం మొదటి సంవత్సరంలో నిర్వహించిన పరీక్షల్లో 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు.
నాణ్యమైన విద్యను అందిస్తున్నాం..
కీసరలోని మహాత్మాజ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ఈ గురుకులంలో విద్యార్థులను చేర్పించడానికి తల్లిదండ్రు లు ఆసక్తి చూపుతున్నారు. విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు కల్పించాం. మొదటి సంవత్సరం పరీక్షల్లో మా గురుకులం నుంచి 12 స్టేట్ ర్యాంకులు వచ్చాయి. ఈ గురుకులంలో విద్యను అభ్యసించే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం.
-గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాములు
టీచర్లు పాఠాలు బాగా చెబుతున్నారు..
ఈగురుకులంలో తమకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. సబ్జెక్ట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా టీచర్లు వాటిని నివృతి చేస్తున్నారు. ఒకటికి రెండుసార్లు పాఠ్యాంశాలను చెప్పడంతో మాకు చక్కగా అర్థం అవుతుంది. స్టేట్లో తనకు 5వ ర్యాంక్ వచ్చింది. వచ్చే మార్చిలో నిర్వహించే ఇంటర్ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి కృషి చేస్తాను.
-ఎ. అంజలి రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకర్ విద్యార్థిని
వసతులు బాగున్నాయి..
ఈ గురుకులంలో వసతులు బాగున్నాయి. ప్రభుత్వం మాకు ఉచితంగా పుస్తకాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నది. భోజనం కూడా మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఎంబీబీఎస్ చేయాలనేది నా కళ.
-పి. వైష్ణవి రాష్ట్రస్థాయి 7వ ర్యాంకర్ విద్యార్థిని
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
తామంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గురుకుల పాఠశాలలు విద్యార్థుల పాలిటకల్పవృక్షాలుగా మారింది. బైపీసీలో నేను రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించాను. ఈ సంవత్సరం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి పట్టుదలతో చదువుతున్నాను.
-నాగశ్రీ, రాష్ట్రస్థాయి 8వ ర్యాంకర్ విద్యార్థిని