చర్లపల్లి, డిసెంబర్ 22: విద్యార్థులు ఉన్నత ఆశయాలు ఏర్పాటుచేసుకొని చదవాలని నిజాం కాలేజీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ సాంబశివ ధరావత్ పిలుపునిచ్చారు. శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని గురువారం ఏఎస్రావునగర్లోని భా ష్యం లిటిల్చాంప్స్ పాఠశాలలో ‘ఎడ్యూ-ఎక్స్పో 2022’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సాంబశివ మాట్లాడుతూ.. విద్యార్థులు శూన్యం నుంచి ఉన్నత శిఖరాలకు ఎలా చేరుకోవాలో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. కార్యక్రమంలో పాఠశాల సీఈవో చైతన్య, జెడ్ఈవో మార్కండేయ, ప్రధానోపాధ్యాయురాలు మాధవీలత, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.