Suicide: మార్కులు తక్కువ వచ్చాయని మాదాపూర్ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్ నారాయణ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీకాళహస్తికి చెందిన విజయ్ అనే విద్యార్థి తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు.
అయ్యప్ప సొసైటీలోని రామానుజన్ క్యాంపస్లో విజయ్ ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపంతో శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.