సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో గురువారం నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ నుంచి శాసన సభ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు, ర్యాలీలకు, గుంపులుగా వెళ్లడం.. లాంటి వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహారిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం 6 గంటల నుంచి సమావేశాలు పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.