పరేడ్గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బుధవారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కార్యక్రమం సజావుగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా పార్కింగ్ ఏర్పాట్లు ఉండాలని, వీఐపీ రాకపోకలకు ఇబ్బందులు రాకుండా చేపట్టబోయే చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేయర్ వెంట ఎమ్మెల్సీ వెంకట్, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, అంబర్పేట కాంగ్రెస్ ఇన్చార్జి డాక్టర్ రోహిణ్రెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ రాజశేఖర్ ఉన్నారు.