మన పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం నార్సింగి, బాచుపల్లిలో నూతన పోలీస్స్టేషన్ భవనాలను ప్రారంభించారు. మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, వివేకానంద్, యాదయ్య, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్కుమార్, వాణీదేవి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు.
దుండిగల్, మార్చి 24: తెలంగాణ పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో రూ.3.5కోట్ల అరబిందో ఫార్మా ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులతో అధునాతనంగా నిర్మించిన బాచుపల్లి పోలీస్స్టేషన్ భవనాన్ని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, సురభివాణీదేవి, నవీన్కుమార్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి హోంమంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ పారదర్శక పాలనలో పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పరచుకొని వారి సమస్యలను పరిష్కరించడంలో విజయం సాధించారని కొనియాడారు.
గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీపోలీసింగ్ సహా పోలీసు శాఖలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టిందని తెలిపారు. సీఎం కేసీఆర్ పోలీస్శాఖకు ప్రత్యేక ప్రాధన్యత కల్పించారని, పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని కేసులను త్వరితగతిన ఛేదిస్తున్నారని పేర్కొన్నారు. బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థలో జపాన్ ముందు వరుసలో నిలువగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముందువరుసలో నిలుస్తున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, జాయింట్ సీపీ అవినాష్ మహంతి, బాలానగర్ జోన్ డీసీపీ టి.శ్రీనివాసరావు, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్ మధన్మోహన్రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, డిప్యూటీ మేయర్ ధన్రాజ్యాదవ్, ఇన్చార్జి కమిషనర్ రామకృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ కాసాని సుధాకర్, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు,పోలీసు ఉన్నతాధికారులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.