తెలుగు యూనివర్సిటీ, ఫిబ్రవరి 5: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సాహిస్తుందని ప్రముఖ సినీ నటులు, డాక్టర్ సుమ న్ అన్నారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన టోర్నమెంట్ బ్రోచర్, ట్రోఫీని సినీ నటులు డాక్టర్ సుమన్, తెలంగాణ క్రీడా ప్రాధికారక సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ కార్యక్ర మానికి సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ జన్మ దినం సందర్భంగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయ మని, తెలంగాణ ప్రభుత్వం నైపుణ్యత, ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్స హిస్తుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖ ర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 13న జాతీయ స్థాయి కరాటే, కుంగ్ పూ ఛాంపియన్ షిప్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్క ర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహకులు డాక్టర్ వి.రవి, ఎన్.లక్ష్మి ప్రకటించారు. జాతీయ స్థాయి కరాటే పోటీలలో 20 రాష్ర్టాలకు చెందిన 200 మంది క్రీడాకారులు పాల్గొంటారని శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, నిర్వాహకులు రవి వెల్లడించారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్, నీలోఫర్ కేష్ ఎండి బాబూరావు, గాయత్రి గ్రానైట్స్ ఎండీ వి.రవి చంద్ర, ఎస్డీ అకాడమీ రుద్రమదేవి పాల్గొన్నారు.