మొదటి విడుతలో 251మంది లబ్ధ్దిదారులకు పట్టాలు
నేడుప్రారంభించనున్న తలసాని
వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
మారేడ్పల్లి, మార్చి 2 ;ఇరుకుగా ఉన్న డబ్బా ఇండ్ల నుంచి విముక్తి కల్పించి ఆత్మ గౌరవంగా జీవించేలా ఓల్డ్ మారేడ్పల్లిలో పేదల కోసం విశాలమైన డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కుటుంబాల్లో వెలుగులు నింపింది. హౌసింగ్ బోర్డుకు చెందిన స్థలంలో పేదలు నివాసం ఉంటూ తమ ఇండ్ల క్రమబద్ధీకరణకు ముమ్మర ప్రయత్నాలు చేశారు.కాని ఫలితం దక్కలేదు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఎమ్మెల్యే జి. సాయన్న, మంత్రి తలసాని శ్రీని వాస్ యాదవ్లు ఇక్కడి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని…సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులకు 2017లో మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యే జి.సాయన్న భూమి పూజ చేశారు.
నేడు డబుల్ ఇండ్లు ప్రారంభం వెల్లడించిన
మారేడ్పల్లి, మార్చి 2: మోండా డివిజన్ ఓల్డ్మారేడ్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నేడు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే జి. సాయన్న తెలిపారు. ఓల్డ్మారేడ్పల్లిలోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి. సాయన్న మాట్లాడుతూ….ఓల్డ్మారేడ్పల్లి బస్తీలో 536 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు కాగా, ఇందులో 468 ఇండ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఓల్డ్మారేడ్పల్లి నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తున్నామని తెలిపారు. మొదటి విడుదత జాబితాలో తమ పేరు లేదని ఎవరూ భయపడి, ఆందోళనకు గురికావద్దని..ఈ బస్తీలో ఉన్న వారందరికీ కచ్చితంగా ఇస్తామన్నారు. ఈ నెల 14న బస్తీ వాసులందరితో సమావేశం ఏర్పాట్లు చేసి మిగితా వారికి కేటాయించే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ వెంకట్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక, టీఆర్ఎస్ నాయకులు టీఎన్. శ్రీనివాస్, సీఎన్. నర్సింహాముదిరాజ్, పిట్ల నాగేష్ ముదిరాజ్,ముప్పిడి గోపాల్, సదానంద్గౌడ్, సంతోష్, మాజీ కార్పొరేటర్ లాస్య నందిత, పెంటా శ్రీహరి, కిరణ్, ఉమా శంకర్, శ్రీనివాస్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.