ఆర్కేపురం/ బడంగ్పేట్, ఏప్రిల్ 4 : అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్కు చెందిన 113 మందికి, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 305 మందికి, తుక్కుగూడ మున్సిపాలిటీలో 75 మందికి ఎమ్మెల్సీలు యెగ్గే మల్లేశం, బొగ్గారపు దయానంద్గుప్తతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏండ్లుగా ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న పేద ప్రజలకు 58, 59 జీవో కింద పట్టాలను అందజేస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు నియోజకవర్గంలో 1248 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితాహరినాథ్ రెడ్డి, కందుకూరు ఆర్డీవో సూరజ్, తహసీల్దార్ జయశ్రీ, మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు బేర బాలకిషన్, మురుకుంట్ల అరవింద్, మాజీ యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, డివిజన్ మాజీ అధ్యక్షుడు ఇంటూరి అంకిరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ మాజీ చైర్మన్ రాంనర్సింహాగౌడ్, నాయకులు దర్పల్లి అశోక్, సిరిపురం రాజేశ్ గౌడ్, కొండ్ర శ్రీనివాస్, దర్శన్ ముదిరాజ్, రాఘవేంద్రగుప్త, పి.రాజు, ప్రత్యూష్, స్వప్న, తదితరులు పాల్గొన్నారు.