హైదరాబాద్ : స్టాఫ్ నర్సుగా(Staff nurse) పని చేస్తున్న ఓ యువతి హాస్పిటల్ గదిలో ఆత్మహత్య(Commits suicide) చేసుకున్న విషాదకర సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వెస్ట్ బెంగాల్కు చెందిన ప్రియ(23) సరూర్నగర్లోని సాయితేజ దవాఖానలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నది. ఆదివారం డ్యూటీ లేకపోవడంతో దవాఖాన గదిలో ఉంది.
ఈ క్రమంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాక పోవడంతో మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.