మాదాపూర్, అక్టోబర్ 13: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉన్న నమ్మకంతో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అభ్యర్థిగా ప్రకటించడం సంతోషంగా ఉందని, నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాపాడుకుంటు అహర్నిశలు ప్రజల కొరకు శ్రమిస్తానని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో పలు కాలనీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో రూ.
౯ వేల కోట్ల వ్యయంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ దిశగా తీసుకువెళ్ళేందుకు అనేక విధాల కృషి చేస్తున్నట్లు చెప్పారు. మహిళా పక్షపాతి, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలతో పాటు పేదింటి మహిళలకు లక్షా నూట పదహర్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆసరా ఫించన్లు, ఒంటరి మహిళా ఫించన్లు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు, రైతుబంధు, రైతులకు ౨౪ గంల ఉచిత కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్ప కార్యక్రమాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మౌలిక వసతుల కల్పనకై కృషి చేస్తున్నారని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఐటీ రంగం, అతిపెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివసిస్తున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ ద్వారా సాఫీగా ప్రయాణాలు సాగే విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్ధేశ్యంతో ఎస్ఆర్డిపి ప్రాజెక్టుల్లో భాగంగా మొట్టమొదటిగా అయ్యప్ప సొసైటీలో అండర్ పాస్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్ఆర్డిపిలో ౧౦ పనులకు గాను ౯ పనులు పురోగతి అయినట్లు చెప్పారు. తమరొకటి పురోగతిలో ఉందన్నారు. ప్రత్యామ్నాయ రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలు, కొత్త ప్రాతిపదనలతో కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో అద్భుతమైన ప్రణాళిలతో ముందుక సాగడం జరిగిందన్నారు. అభివృద్ధిలో భాగంగా అధికారులను సమన్వయం చేసుకుంటు ఇన్ని రోడ్లు అభివృద్ధి చేయడం అంటే బహుశా ౫౦ ఏండ్ల చరిత్రలో మొట్టమొదటి సారిగా గొప్ప కార్యక్రమాలని తెలిపారు.