సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నగరంలో శ్రీరామ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అయోధ్యలో నేడు రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉండటంతో నగరంలో రాముడి నామ జపం హోరెత్తింది. అందులో భాగంగానే కొందరు రామ భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరికొందరు విభిన్న రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం కోఠిలో శ్రీరాముల వారికి ప్రత్యేక పూజలు, ఎల్ఈడీ ప్రదర్శన, అన్న ప్రసాద వితరణ, సాయంత్రం దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరుకానున్నారని పేర్కొన్నారు.