బంజారాహిల్స్, సెప్టెంబర్ 5: బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో లక్ష నాగవల్లి అలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన లక్ష తమలపాకులతో అలంకరించిన తర్వాత నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
అంతకుముందు స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్బండ్ ఆంజనేయస్వామి ఆలయం నుంచి వచ్చిన 11మంది బృందంచే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోటుపల్లి శేషశైలాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.