Governor Tamilisai | కవాడిగూడ, జనవరి 27: ప్రజల సంక్షేమానికి యాగాలు జరిపించడం అభినందనీయమని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కోటి ప్రత్యంగిరా యాగం వల్ల లోక కల్యాణం జరుగుతుందని వారు పేర్కొన్నారు. సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా కుర్తాళం సిద్ధేశ్వరానంద పీఠం ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం జరుగుతున్న కోటి ప్రత్యాంగిరా మహాయాగంలో భాగంగా సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి నేతృత్వంలో శ్రీకాళీ కాళ భైరవ కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించా రు.
ఏడు రోజుల పాటు హోమ యాగాలు, పూ జలు వైభవంగా జరిగాయి. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై యాగంలో పాల్గొన్నారు. శ్రీ కాశీ క్షేత్రంలో భైరవుని పూజించిన రుద్రాక్ష కార్యక్రమాన్ని నిర్వంహించారు. అనంతరం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం, సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి పాల్గొని భక్తులకు అనుగ్రహం చేశారు. కార్యక్రమంలో రమ్యానంద భారతి స్వామిని, ఫీఠం కో-ఆర్డినేటర్ మునిపల్లె శ్రీనివాస్, చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ మోచర్ల శశిభూషణ్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.