హైదరాబాద్ : కామన్ వెల్త్ గేమ్స్ లో మిక్స్డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ గ్రహీత ఆకుల శ్రీజ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్నారు. సోమాజిగూడలోని తన నివాసరంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ..మొక్కల పెంపకంపైనే మానవ మనుగడ ఆధారపడి ఉంటుందన్నారు. మొక్కలు నాటడం వల్ల సమయానికి వర్షాలు పడుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని శ్రీజ సూచించారు.
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం తన కోచ్ సోమ్నాథ్ ఘోష్, స్నేహితురాలు కృతిక, ఉమామహేశ్వర రావుకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.