మేడ్చల్, మే 31(నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించేలా కలెక్టర్ అమోయ్కుమార్ ప్రత్యేక అధికారులను నియమించారు. జూన్ 2 నుంచి 22 వరకు ప్రణాళిక ప్రకారం ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రభుత్వం నిర్దేషించిన రోజువారి కార్యక్రమాలు జిల్లాలో సజావుగా జరిగేలా ప్రత్యేక అధికారుల కమిటీ పర్యవేక్షించనుంది.
జిల్లా ప్రగతిని చాటుతాం
దశాబ్ది ఉత్సవాలలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రగతిని చాటుతాం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రతి రోజు జరిగే కార్యక్రమాలలో 2014కు ముందు, ఇప్పటి వరకు సాధించిన అభివృద్ధిని ప్రజలకు చూపించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. రోజువారి కార్యక్రమాలలో కరపత్రాలను పంపిణీ చేస్తాం. మున్సిపాలిటీలు, ప్రధాన జంక్షన్లలో ఆర్చీలు, ఫ్లెక్సీలు, హోర్డింగులు, విద్యుదీపాలను అలంకరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
–కలెక్టర్ అమోయ్కుమార్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా
నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారులు