ఘట్కేసర్,మార్చి14: పోచారం మున్సిపాలిటీలో వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని పాలక వర్గం నిర్ణయించింది. చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం నీటి సరఫరా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. వేసవిలో ప్రతిరోజూ నీటి సరఫరా జరిగే విధంగా సిబ్బంది, అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.సరఫరాలో ఏర్పడే సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.నీటి వృథా జరుగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.మున్సిపాలిటీలో పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అందడం లేదని, బిల్లులు మాత్రం వేలల్లో వేస్తున్నారని పాలక వర్గం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన నీటి బిల్లులను రద్దు చేయాలని నిర్ణయించారు. ప్రతిరోజూ కృష్ణా నీరు సరఫరా చేసి, ప్రతి ఇంటికి నీటి మీటర్లు ఏర్పాటు అయ్యాక బిల్లులు వసూలు చేయాలని నిర్ణయించారు.పోచారం మున్సిపాలిటీలో ఒక రోజు బోరునీటిని, మరో రోజు కృష్టా నీటిని సరఫరా చేయడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కౌన్సిలర్లు పేర్కొన్నారు.మున్సిపాలిటీలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య సిబ్బందిని సన్మానించారు.వైస్ చైర్మన్ రెడ్డ్యానాయక్,కమిషనర్ సురేశ్, నీటి సరఫరా అధికారి శ్రీనివాస్ రెడ్డి,కౌన్సిలర్లు మహేశ్, సాయిరెడ్డి,వెంకటేశ్గౌడ్, రాజశేఖర్,హరిప్రసాద్రావు, రవీందర్,మెట్టు బాల్రెడ్డి,అధికారులు పాల్గొన్నారు.
బోడుప్పల్, మార్చి14: బోడుప్పల్ నగరపాలక సంస్థ 5వ డివిజన్ పరిధిలో తాగునీటి సమస్య లేకుండా చర్య లు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి వాటర్వర్క్స్ జీఎం శ్రీనివాస్రెడ్డిని కోరారు. ఈ మేరకు ఐఐసీటీ కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో జీఎం శ్రీనివాస్రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఎండలు తీవ్రమైతున్న నేపథ్యంలో అవసరమైతే నూతన పైపులైను వేసి రోజు విడిచి రోజు తాగునీరును అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జీఎం తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలుతీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రుద్రదాస్, బుచ్చిరెడ్డి, ముఖేశ్, మూర్తి, వసంతకుమార్రెడ్డి, లక్ష్మారెడ్డి, ఆచార్యులు, పద్మారావు, వర్క్ ఇన్స్పెక్టర్ పురుషోత్తం, మదు తదితరులు పాల్గొన్నారు.
నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, సమస్య పరిష్కారం దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేశ్యాదవ్ కోరారు. మంగళవారం బోడుప్పల్ వాటర్వర్క్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్రెడ్డితో కలిసి కాలనీల్లో పర్యటించారు. ఎండలు తీవ్రమవుతున్నందున తాగునీరు సరిపోవడం లేదని, కొన్ని నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 23వ డివిజన్ రా చెరువుకు సమీపంలో ఉనందున బోరుబావి నీరు కలుషితం అవుతున్నాయని, నిర్ధిష్ట సమయంలో తాగునీరును విడిచిపెట్టాలని కాలనీవాసులు కోరారు. రోజు విడిచి రోజు తాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ ప్రతినిధులు సురేందర్రెడ్డి, అలీ, రాజ్కుమార్, ప్రవీణ్, రవి, నాగరాజు, సుదర్శన్, రాజేందర్, సర్వోత్తమ్రెడ్డి, బాల్రాజు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.