సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను బకాయిల వసూలు కోసం అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో ప్రతి సర్కిల్ నుంచి ఇద్దరు ఉద్యోగులు ఎక్కువ బకాయిలు ఉన్న వంద మంది ఆస్తిపన్ను బకాయిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి ఆస్తిపన్ను చెల్లించాలని, ఆస్తిపన్ను వడ్డీపైన 90 శాతం రాయితీని (ఈనెల 31లోపు) సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నట్లు అధికారులు వివరించారు.