చార్మినార్ : నగరంలో వేసవి ప్రతాపం అప్పుడే మొదలైంది. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపం నుండి తప్పించుకోవడానికి అనేక ఉపశమనాలు చేస్తున్నా భానుడి సెగలు చెమటలు పోయిస్తున్నాయి. హైదరాబాద్ జూలోని జంతువులు సైతం భగభగల నుండి సెలయేళ్లను ఆశ్రయిస్తున్నాయి.
జంతువులకు వేసవి తాపం తీర్చడానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని జంతు ఎన్క్లోజర్లలో జూ అధికారులు ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసి చల్లదనాన్ని అందిస్తున్నారు.
మరికొన్నింటికి పౌంటేన్లు ఏర్పాటు చేసి ఎండ వేడి నుండి జంతువులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జూ అధికారులు తెలిపారు.