ఘట్కేసర్, జూలై 30: తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి అమలు చేస్తున్నారని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, టీఎస్జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యానాయక్లు అన్నారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో ఆదివారం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో మేడ్చెల్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి సంత్ సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ నిధుల కేటాయింపు జరుగుతున్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా మార్చి ఎంతో మంది గిరిజన నాయకులకు రాజకీయ అవకాశాలను కల్పించారని తెలిపారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన ఎస్టీ జాబితా నుంచి గిరిజనులను తొలగించాలని చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా బంజార సేవా సంఘ్ తీవ్రంగా ఖండిస్తున్నదని గిరిజన నాయకులు వాల్యానాయక్, రాంచందర్ నాయక్లు తెలిపారు. గిరిజనుల్లో విభేదాలు సృషించడానికి ఇది బీజేపీ ఆడుతున్న డ్రామా అన్నారు. సభా అధ్యక్షుడు జిల్లా కమిటీ ఇన్చార్జి దేవిదాస్, బంజార సేవా సంఘ్ జనరల్ సెక్రెటరి సోమ్లా నాయక్, నాయకులు నానావత్ రెడ్యా నాయక్, భూక్యా సుమన్ నాయక్, మోహన్ సింగ్, దీప్లాల్ చౌహన్, సీతారాం నాయక్, హము నాయక్, జిల్లా మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సమావేశంలో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడుగా పోచారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రెడ్యా నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్ సెక్రెటరి శంకర్ చౌహన్ నాయక్, ట్రెజరర్ డీఎస్ నాయక్, వైస్ ప్రెసిడెంట్లు భీమ్లా నాయక్, వాల్యా నాయక్, మాన్సింగ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు వి.రాము, బి.సూర్యనారాయణ, ఖాసీంరాం, లక్ష్మణ్ నాయక్, సభ్యులను ఎన్నుకున్నారు.