రవీంద్రభారతి, అక్టోబర్ 26: కారణజన్ముడు ఎస్పి. బాలసుబ్రహ్మణ్యం అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. పద్మభూషన్ డా.కె.వి. పరప్రసాద్రెడ్డి సమర్పణలో ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్కిశోర్ రచించి, రూపొందించిన గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డాక్యుమెంటరీ ప్రదర్శన రవీంద్రభారతి పైడి జయరాజ్ కాన్ఫరెన్స్ హాల్లో సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కెవి.రమణాచారి విచ్చేసి మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడని, ఆయన మన మధ్యలేకున్నా ఆయన పాటలు సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఉంటాయని కొనియాడారు. ఈ సందర్భంగా సంజయ్కిశోర్ను అభినందించారు. అనంతరం వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. బాలసుబ్రహ్మణ్యం జీవిత చరిత్రను డాక్యుమెంటరీ రూపొందించడం ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. సమాజ హితం కోసం పాటుపడేవారిని సమాజం ఎన్నటికీ మరువదన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సినీనటి రోజా రమణి, తమ్మారెడ్డి భరద్వాజ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంజయ్కిశోర్ను ఘనంగా శాలువాతో సత్కరించారు.