సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాత్రి వేళల్లో ఒంటరిగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్ల స్నాచింగ్, బైక్ దొంగతనాలు చేస్తున్న ముఠాను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీలు సునీల్దత్, చక్రవర్తి గుమ్మి శుక్రవారం వివరాలు వెల్లడించారు. మాదన్నపేటకు చెందిన మహ్మద్ ఇసాఖ్, మహ్మద్ తాహయుద్దీన్ విద్యార్థులు. ఇసాఖ్ 2018 నుంచి సెల్ఫోన్ స్నాచింగ్లు చేస్తూ నాలుగు కేసుల్లో జైలుకు వెళ్లాడు.
2022 ఏప్రిల్లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన స్నేహితుడైన తాహయుద్దీన్తో కలిసి రాత్రి వేళల్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్ చేసి దొంగతనాలు చేశారు. నిందితులను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన 9 సెల్ఫోన్లు, ఒక బజాజ్ పల్సర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దొంగిలించిన సొత్తును కొలుగోలు చేస్తున్న మహ్మద్ కైఫ్ పరారీలో ఉన్నాడు.