ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్లో టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారప్ ఫరూఖీ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ రెడ్డి, కె.రాములు, జి.పర్వతం, సీహెచ్ మదన్ మోహన్ రావు, ఎస్.స్వామి రెడ్డి, జి.గోపాల్, సీవీఓ శ్యామ్బాబు, చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.