హైదరాబాద్: మాండూస్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్లో వాన కురుస్తున్నది. శనివారం సాయంత్రం నుంచి ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉన్నది. దీంతో రాత్రి నుంచి నగరంలోని చాలా ప్రాంతాల్లో ముసురు పడుతున్నది. బంజారాహిల్స్, అమీర్పేట, పంజాగుట్ట, సనత్నగర్, బోయిన్పల్లి, సికింద్రాబాద్, నాంపల్లి, కోఠి, ఉప్పల్, ఎల్బీనగర్ వనస్తలిపురం తదితర ప్రాంతాల్లో వాన పడుతున్నది.
కాగా, మాండూస్ తుఫాను వల్ల తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో జోరుగా వర్షం కురుస్తున్నది. తెలంగాణలో మోస్తరుగా ఉన్నది. అయితే రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.