రాబోయే వంద సంవత్సరాలకుపైగా ప్రజానీకం సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో ఉప్పల్లో స్కైవాక్ను నిర్మిస్తున్నది. హైదరాబాద్ ఈస్ట్ అభివృద్ధిలో భాగంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును చేపట్టింది. నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా మారుస్తూ, పాదచారుల రక్షణే ధ్యేయంగా ఆకాశ వంతెనును నిర్మించారు. దాదాపు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ స్కైవాక్ ప్రాజెక్టు పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ను వినియోగించారు. మొత్తం 660 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బోర్డ్ వాక్లో 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు (స్టేర్ కేసెస్), 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు పనులన్నీ చివరి దశలో ఉండడంతో త్వరలోనే ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): జంట నగరాలు, శివారు ప్రాంతాల అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) త్వరలో ఇన్నర్ రింగ్ రోడ్డు ఉప్పల్ చౌరస్తాలో పాదచారుల రక్షణ కోసం నలువైపులా రోడ్డు దాటేందుకు వీలుగా ఆకాశ వంతెన సైవాక్(బోర్డ్ వాక్)ను ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురానున్నది. సుమారు రూ.25 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఉప్పల్ సైవాక్ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. రాబోయే వంద సంవత్సరాలకు పైగా ప్రజానీకం సౌకర్యార్థం మనుగడలో ఉండే లక్ష్యంతో పాదచారుల వంతెన(ఉప్పల్ సైవాక్ ప్రాజెక్టు)కు రూపకల్పన చేశారు. ఉప్పల్ సైవాక్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో సుమారు వెయ్యి టన్నులకుపైగా స్ట్రక్చరల్ స్టీల్ను వాడారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ తూర్పు (ఈస్ట్) వైపు అభివృద్ధిని, పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని మూడేళ్ల క్రితం స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్కు సూచించారు. దానికి అనుగుణంగానే ఆరిటెక్చర్లు, డిజైనర్లు, సీనియర్ ఇంజినీర్ల బృందానికి ఉప్పల్ సరిల్లో కొత్త ప్రాజెక్టు బాధ్యతలను మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ అప్పగించారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను హెచ్ఎండీఏ చేపట్టింది.
నిత్యం ఎంతో రద్దీతో ఉండే ఉప్పల్ చౌరస్తాలో రోడ్డు దాటే(రోడ్ క్రాసింగ్) సమయంలో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, ప్రమాదాల్లో ఎకువ శాతం మహిళలు, పాఠశాల విద్యార్థులు గాయపడుతున్న అంశాలను దృష్టిలో పెట్టుకొని అకడ పాదచారుల వంతెన( సైవాక్ లేదా బోర్డ్ వాక్) నిర్మాణం శ్రేయస్కరమని ప్రభుత్వం నిర్ణయించింది. ఉప్పల్ చౌరస్తాలో నలువైపులా ప్రతినిత్యం సుమారు 20 వేలమందికిపైగా పాదచారులు అటు ఇటు రోడ్ క్రాసింగ్ చేస్తారని అంచనా. ఉప్పల్ సై వాక్ అందుబాటులోకి రావడం ద్వారా కాలిబాటన రోడ్డు దాటే పాదచారులు సైవాక్ ను వినియోగించడం వల్ల ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీ గా వాహనాల రాకపోకలకు అవకాశం కలుగుతుంది. ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్ ద్వారా ప్రతి రోజు సుమారు 25 వేల నుంచి 30 వేల మంది ప్రయాణికుల రద్దీ ఉంటుంది. ఇకపైనా ఉప్పల్ మెట్రో రైలు ప్రయాణికులు మెట్రో కాన్కోర్ (ఫ్లోర్) నుంచి పాదచారుల వంతెన (సై వాక్) మీదుగా వారి అవసరాలకు అనుగుణంగా వారి వారి గమ్య స్థానాలవైపు వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.
ఉప్పల్ స్కైవాక్ సుదీర్ఘకాలం మన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాదచారుల వంతెన నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్), వైజాగ్ స్టీల్ (విశాఖపట్నం) తోపాటు జిందాల్ స్టీల్ కంపెనీలకు చెందిన స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించారు. పాదచారుల వంతెన ప్రాజెక్టులో భాగంగా ప్రజలకు 8 లిఫ్టులు, 6 మెట్ల మార్గాలు (స్టేర్ కేసెస్), 4 ఎస్కలేటర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. మొత్తం 37 పిల్లర్లతో 660 మీటర్ల పొడవునా మూడు, నాలుగు, ఆరు మీటర్ల వెడల్పు కలిగిన ఉప్పల్ సైవాక్ భూమిపై నుంచి ఆరు మీటర్ల ఎత్తులో ఉంటుంది. మొత్తం 660 మీటర్ల పొడవు కలిగిన పాదచారుల వంతెన బ్యూటిఫికేషన్ లుక్ కోసం పైభాగంలో కేవలం 40 శాతం మేరకు రూఫ్ కవరింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టులో 90 శాతం మేరకు స్ట్రక్చరల్ స్టీల్ వాడకం ఉండడం, వెల్డింగ్ పనుల కోసం ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా నిర్ణీత కాలంలో ప్రాజెక్టు పనులు జరగలేదు. ప్రస్తుతం పనులన్నీ చివరి దశకు చేరుకోవడంతో ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.