సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని సైదాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎల్ఎఫ్ఎల్ హెడ్మాస్టర్ ఎం వెంకట్రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం కౌకూర్కు చెందిన టి. మురళీకృష్ణమూర్తి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వరకాల పరమేశ్వర్లు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ మేరకు గురువారం విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తమ ఉపాధ్యాయులు జాబితాలో పేర్లు వెల్లడించారు. సెప్టెంబర్ 5న నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో అవార్డులు అందుకోనున్నారు. కాగా, జిల్లాలోని శాంతినికేతన్ యూపీఎస్ పాఠశాలకు (ఎయిడెడ్) చెందిన టీ మధుసూధన్ ఎస్జీటీకి (స్పెషల్ క్యాటగిరి) ఉత్తమ టీచర్ అవార్డు ఎంపికకు ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించింది.