Shamshabad | శంషాబాద్ రూరల్, జూలై 13 : పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన ఆదివారం జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పోలీస్స్టేషన్ పరిధిలోని తొండుపల్లిలో 5స్టార్గ్రాండ్ హోటల్లో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆరుగురు వ్యక్తులు బెట్టింగ్లు పెట్టుకొని మూడుముక్కలాట ఆడుతున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 3,210 రూపాయల నగదుతో పాటు ఆన్లైన్ లావాదేవిలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తొండుపల్లికి చెందిన అంజయ్య, ఊటుపల్లికి చెందిన ప్రదీప్, జైపాల్, ఎం రాజు, కిషన్గూడకు చెందిర కొండరాజు, బాలపూర్కు చెందిన నిఖిల్కుమార్, హైదరాబాద్ నగరంలోని మాదాపూర్కు చెందిన తిరుపతిరావులను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించిన్నట్లు తెలిపారు.